Schools Colleges Reopen : తెలంగాణా లో పాఠశాలలు తెరుచుకుంటాయి అనగా హైకోర్టు కొన్ని కీలకమయిన ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణా లో పాఠశాలలు తెరుచుకుంటాయి అనగా హైకోర్టు కొన్ని కీలకమయిన ఆదేశాలు జారీ చేసింది, హైకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే స్కూల్ కి వెళ్ళాలా? వద్దా? తల్లి తండ్రులు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి?. ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కోర్ట్ వ్యాఖ్యలని ఎలా అర్దం చేసుకోవాలి? ఇదే ఇప్పుడు అందరికీ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణా లో స్కూళ్ళ ప్రారంభానికి (Schools Colleges Reopen) హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది, గురుకులాలు, హాస్టళ్లు తెరవకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలనిచ్చింది, అలాగే స్కూళ్ళకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కూడా జీవో జారీ చేసింది, అయితే ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపడం అనేది వారి తల్లి తండ్రుల విచాక్షణకే వదిలేసింది.
విద్యా సంస్థల (Schools Colleges Reopen) ప్రత్యక్ష బోధన పైన హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, అలాగే ప్రత్యక్ష తరగతులకి హాజరు కాని విద్యార్థుల పైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది, ప్రత్యక్ష తరగతులకి రావాలని విద్యార్థులని బలవంతం చేయకూడదు అని కూడా ఆదేశాలు ఇచ్చింది.
అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని జీవో జారీ చేసింది. ఆన్లైన్(పరోక్ష) లేదా ఆఫ్లైన్(ప్రత్యక్ష) బోధనను విద్యా సంస్థలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది.
అయితే ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది, అయితే వారం లోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యా శాఖకు ఆదేశం ఇచ్చింది.
పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని, అలాగే గురుకులాలు, హాస్టల్స్ లో ప్రత్యక్ష బోధన పై కూడా హైకోర్టు స్టే విధించింది, అలాగే గురుకులాలు, హాస్టల్స్ ను తెరవద్దని కూడా ఆదేశం ఇచ్చింది
ఇంకా గురుకులాలు, హాస్టల్స్ ఉండే వసతులపై ఒక నివేదికను సమర్పించాలని ఆదేశం ఇచ్చింది, రాష్ట్రం లో కోవిడ తీవ్రత ఇంకా కొనసాగుతోంది అని అప్పుడే గురుకులాలు తెరవద్దని తెలిపింది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మూడవ దశ పొంచి ఉందని హెచ్చరికలు చేస్తోంది, కానీ విద్యా సంస్థలు (Schools Colleges Reopen) తెరువకపోతే విద్యార్థులకి నష్టం జరుగుతుందని, ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని తెలిపింది, అయితే ఈ విచారణని హైకోర్టు అక్టోబర్ 4 కి వాయిదా వేసింది, ఇదీ హైకోర్టు ఇచ్చిన సారాంశం.
దీనితో ఒక్కసారిగా అందరిలో అయోమయ పరిస్థితి నెలకొంది, ఇంతకీ స్కూళ్ళకి వెళ్ళాలా? వద్దా? అన్న గందరగోళానికి తెర లేచింది, మొత్తం మీద ఇటు విద్యార్థులు, అటు తల్లి తండ్రులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
హైకోర్టు ఆదేశాలను అనుసరించి చెబితే మీ పిల్లల్ని స్కూల్ కి పంపమంటూ ఏ తల్లి తండ్రులని బలవంత పెట్టరాదు, ఫలానా స్కూల్ తెరవట్లేదని ఏ విద్యా సంస్థ మీద చర్య తీసుకోడానికి వీల్లేదు, కాబట్టి స్కూళ్ళకి వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పట్లో లేనట్టే.